ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ వ్యాపారం పేరుతో రూ. 19.85 లక్షలు దోచుకున్న మోసగాళ్లు

author img

By

Published : Nov 7, 2020, 8:38 PM IST

man cheated on 20 lakhs saying profits can be earned by online business
ఆన్​లైన్​ వ్యాపారం పేరుతో రూ. 19.85 లక్షలు మోసం

ఆన్​లైన్​ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించిన ఘటన కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఆన్​లైన్​లో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పిన మోసం చేస్తున్న వారి బారినపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

ఆన్​లైన్​ వ్యాపారం చేద్దామంటూ ఓ వ్యాపారిని మోసగించిన వ్యక్తిని హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. హైదర్​నగర్​లో నివసించే వెంకట స్వరూప్​ అనే వ్యక్తి ఆన్​లైన్​లో డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేసే వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మార్లిన్ జెవోయిర్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పంజాబ్​లోని ట్రాన్స్​ఫ్లెక్స్​ పేటెక్​ సొల్యూషన్స్​ అనే ఆన్​లైన్​ వ్యాపారం కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని మార్లిన్​ నమ్మబలికాడు.

మార్లిన్​ మాటలు నమ్మిన స్వరూప్​.. ఆ కంపెనీ సీఈవో అశోక్​ టాండన్​కు రూ. 19,85,201 డబ్బును ట్రాన్స్​ఫర్​ చేశాడు. ఆ తర్వాత కేవైసీ సమస్య వచ్చిందంటూ మార్లిన్​ ముఖం చాటేశాడు. డబ్బులు తిరిగి పంపించాలని మార్లిన్​ను అడగగా.. రూ. 8 లక్షల చెక్కును వాట్సాప్​ ద్వారా పంపించి.. మిగతా డబ్బులు తిరిగి పంపించేస్తామని నిందితులు నమ్మించారు. తాను మోసపోయానని గ్రహించిన బాదితుడు స్వరూప్​ పోలీసులను ఆశ్రయించగా వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పంజాబ్​లో ఉన్నారని.. స్పెషల్​ టీం ద్వారా వారిని అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.