ETV Bharat / jagte-raho

ఎల్​ఐసీ ఏజెంట్​ రాజిరెడ్డి ఆత్మహత్య

author img

By

Published : Aug 29, 2020, 6:49 PM IST

ఓ ఎల్​ఐసీ ఏజెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్​లో జరిగింది. ​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఎల్​ఐసీ ఏజెంట్​ రాజిరెడ్డి ఆత్మహత్య
ఎల్​ఐసీ ఏజెంట్​ రాజిరెడ్డి ఆత్మహత్య

నిర్మల్​లోని నందిగుండం దుర్గామాత ఆలయ సమీపంలో ఎల్ఐసీ ఏజెంట్ రాజారెడ్డి (50) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిర్మల్​లోని దివ్యనగర్​లో ఉంటున్న రాజారెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి కారులో బయటకు వెళ్లారు.

శనివారం ఉదయం దుర్గామాత ఆలయం వైపు వెళ్లిన భక్తులకు కారులో రాజిరెడ్డి పడిపోయి ఉండడం కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.