ETV Bharat / jagte-raho

మాజీ రేషన్ డీలర్ హత్య.. భూ వివాదామే కారణమా?

author img

By

Published : Jan 7, 2021, 5:15 PM IST

మాజీ రేషన్ డీలర్​ను హత్య చేసి నీటి కుంటలో పడేసిన ఘటన నల్గొండ మిర్యాలగూడ మండలం గద్దగూడు తండా వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

former ration deelar  murder in nalgonda district
మాజీ రేషన్ డీలర్ హత్య.. భూ వివాదామే కారణమా?

నల్గొండ జిల్లా త్రిపురారం మండల అప్పలమ్మగూడెంకు చెందిన గుండెబోయిన వెంకటయ్య(55), అతడి తమ్ముడి కుమారుడు కలసి మిర్యాలగూడ మండలం గద్దగూడు తండా వద్ద మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటయ్యను తమ్ముడి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని నీటి కుంటలో వేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారులు సేకరించారు. మృతుడు వెంకటయ్యకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి: పది రూపాయల కోసం ప్రాణాలు తీశాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.