ETV Bharat / jagte-raho

చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

author img

By

Published : Oct 28, 2020, 10:51 PM IST

చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Fisherman dead due to the fall in water
చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని అర్లి (కె) సుద్దవాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైనా జాలరి గుమ్ముల ఆశన్న (55) మృతి చెందినట్టు... ఇంఛార్జ్​ ఎస్సై సంజీవ్ తెలిపారు. టెంబుర్ని గ్రామానికి చెందిన ఆశన్న చేపల పడుతూ జీవనం సాగించేవాడు.

చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతైన నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి: ఉస్మాన్​నగర్​లో వరద నీటితో తేలుతున్న మృతదేహం గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.