మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న దేవాశిష్ అనే ఓ వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈజ్గాం గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ కిరణ్ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదూచూడండి.. నిర్లక్ష్యం: విద్యుత్ స్తంభం మీదపడి సైకిల్పై వెళ్తున్న వ్యక్తి మృతి