ETV Bharat / jagte-raho

48 గంటలు సమయమిస్తే.. పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు..

author img

By

Published : Oct 28, 2020, 5:36 PM IST

Updated : Oct 28, 2020, 6:22 PM IST

రాజేంద్రనగర్ దంతవైద్యుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్లు 48 గంటల సమయమివ్వగా... 12 గంటల్లోనే కేసు ఛేదించి, ఏడుగురిని అరెస్టు చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ వెల్లడించారు. డాక్టర్​ భార్యకు దగ్గరి బంధువు ముస్తఫా... ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు.

cyberabad cp sajjanar press meet on dentist kidnap case in rajendranagar
48 గంటలు సమయమిస్తే.. పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు

రాజేంద్రనగర్ దంతవైద్యుడు హుసేన్ కిడ్నాప్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు ముస్తఫా... ఆస్ట్రేలియాలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలో ముబాషిర్​ అహ్మద్​తో కలిసి... హైదరాబాద్, పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. ఇద్దరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. డబ్బు కోసం ఎవరైనా ధనవంతుడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొని... దంత వైద్యుడు హుస్సేన్​ను ఎంచుకున్నారు.

ఈ క్రమంలో డాక్టర్ హుస్సేన్​తో పరిచయం పెంచుకున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో డాక్టర్ హుస్సేన్ క్లినిక్​ను ప్రారంభించాడు. ఇదే భవనంలో మొదటి అంతస్తులో ముస్తఫా ఫ్లాట్​ అద్దెకు తీసుకొని నిఘా పెట్టారు. ప్లాన్​లో భాగంగా నిన్న మధ్యాహ్నం లైటర్ తుపాకీతో బెదిరించి డాక్టర్ కారులోనే కిడ్నాప్ చేసి... కర్ణాటకకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

క్లినిక్​ నుంచి హుస్సేన్​ను కూకట్​పల్లికి తరలించని నిందితులు... హుస్సేన్ కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి 48 గంటల్లోపు రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు... 12 బృందాలుగా ఏర్పడి 12 గంటల్లో కేసు ఛేదించినట్టు సీపీ వివరించారు. బెంగళూరుకు తరలిస్తుండగా... నిందితులను పట్టుకునేందుకు అనంతపురం పోలీసులు సహకరించినట్టు సజ్జనార్ వెల్లడించారు.

48 గంటలు సమయమిస్తే.. పోలీసులు 12గంటల్లోనే ఛేదించారు..

ఇదీ చూడండి: ఈత నేర్చుకునేందుకు వెళ్లి చెరువులో యువకుడు గల్లంతు

Last Updated :Oct 28, 2020, 6:22 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.