ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సొంత తమ్ముడిని అన్న కొట్టి చంపాడు. గ్రామానికి చెందిన సోయం రమేష్(30) తాగుడుకు బానిసై... ఇంట్లో రోజు గొడవ పడేవాడు. ఈ క్రమంలో పిల్లల్ని తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తాగుడుకు మరింతగా బానిసయ్యాడు.
వారం రోజులుగా రమేష్కు సోదరుడు శ్రీనుతో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన శ్రీను... రమేష్ తల, మెడపై బలంగా కొట్టాడు. రమేష్ అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అనంతరం శ్రీను పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న ఏటూరునాగారం సీఐ నాగబాబు... కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు తెలిపారు.