ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో అన్న చేతిలో తమ్ముడి హతం

author img

By

Published : Aug 11, 2020, 7:00 AM IST

కుటుంబ కలహాలతో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటన... ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనీగుడెంలో చోటుచేసుకుంది. అనంతరం హంతకుడు పోలీసులకు లొంగిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

brother murdered with family disputes in gamponiguem
కుటుంబ కలహాలతో అన్న చేతిలో తమ్ముడి హతం

ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సొంత తమ్ముడిని అన్న కొట్టి చంపాడు. గ్రామానికి చెందిన సోయం రమేష్​(30) తాగుడుకు బానిసై... ఇంట్లో రోజు గొడవ పడేవాడు. ఈ క్రమంలో పిల్లల్ని తీసుకొని భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తాగుడుకు మరింతగా బానిసయ్యాడు.

వారం రోజులుగా రమేష్​కు సోదరుడు శ్రీనుతో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన శ్రీను... రమేష్​ తల, మెడపై బలంగా కొట్టాడు. రమేష్ అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అనంతరం శ్రీను పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న ఏటూరునాగారం సీఐ నాగబాబు... కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.