ETV Bharat / jagte-raho

బైక్​ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా అరెస్టు

author img

By

Published : Nov 26, 2020, 4:11 PM IST

bike thieves arrested in bellempally
బైక్​ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా అరెస్టు

బైక్​ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ద్వి చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా అరెస్టు వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ.. బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వరుస బైక్​ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దొంగతనానికి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు.

రైల్వే రడగంబాల బస్తీకి చెందిన జోసెఫ్ ఫ్రాన్సిస్ అనే రైల్వే ఉద్యోగి, పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఛత్తీస్​గఢ్​కు చెందిన ఒకరు.. స్థానికులతో కలిసి 12 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. రూ. 8 లక్షల 50 వేల విలువ గల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను రామగుండం సీపీ అభినందించారు.

ఇదీ చదవండి: వరసకు కూతురైన మైనర్​ను గర్భవతి చేసిన బాబాయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.