ETV Bharat / jagte-raho

బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు

author img

By

Published : Oct 29, 2020, 2:23 PM IST

Updated : Oct 29, 2020, 2:59 PM IST

Attack on VRA Lakshmi in Bodhan, nizamabad district
బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు

14:21 October 29

బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు

బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్​లో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళ లక్ష్మిని తీవ్రంగా గాయపరిచి... ఆమె చెవులకు ఉన్న బంగారు ఆభరణాలు, చేతులకు ఉన్న వెండి ఆభరణాలు, కాళ్ల గొలుసులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. స్పృహ కోల్పోయి ఇంట్లో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా... బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రథమచికిత్స అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు సీఐ రాకేష్​ తెలిపారు. లక్ష్మి బోధన్ తహశీల్దార్ కార్యాలయంలో స్వీపర్​గా లక్ష్మీ పనిచేస్తున్నట్టు వివరించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి కర్నూలు యువకుడు ఆత్మహత్య!

Last Updated :Oct 29, 2020, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.