ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

author img

By

Published : Nov 16, 2020, 7:18 PM IST

నల్గొండ జిల్లా వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్​ రోడ్​లో గల రైల్వే వంతెన వద్ద వేగంగా వస్తున్న క్రేన్​ వాహనం.. నడుచుకుంటూ వెళ్తున్న పాదచారున్ని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే మృతుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో రైల్వే వంతెన వద్ద క్రేన్ వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడు. సాగర్ రోడ్​లో గల రైల్వే వంతెన వద్ద వేగంగా వస్తున్న క్రేన్ వాహనం నడుచుకుంటూ వెళుతున్న పాదచారున్ని ప్రమాదవశాత్తు ఢీకొని.. తల మీదినుంచి వెళ్లడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు.

అతని వయస్సు 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్​కి తరలించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.