నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో రైల్వే వంతెన వద్ద క్రేన్ వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందాడు. సాగర్ రోడ్లో గల రైల్వే వంతెన వద్ద వేగంగా వస్తున్న క్రేన్ వాహనం నడుచుకుంటూ వెళుతున్న పాదచారున్ని ప్రమాదవశాత్తు ఢీకొని.. తల మీదినుంచి వెళ్లడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు.
అతని వయస్సు 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్కి తరలించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు!