ETV Bharat / jagte-raho

డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి

author img

By

Published : Nov 23, 2020, 7:32 AM IST

accident took place at bowenpally in secunderabad
డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి

సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పరిధిలో డివైడర్​ను ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ద్విచక్రవాహనం వేగంగా దూసుకొచ్చి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. తాడ్బండ్ నుంచి బోయిన్​పల్లి వైపు వెళ్తున్న సమయంలో మలుపు వద్ద యాక్టివా వాహనంపై ముగ్గురు యువకులు వేగంగా వెళ్తుండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా ముగ్గురు యువకులు రోడ్డుపై పడడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.


ఇదీ చదవండి: కారులో చెలరేగిన మంటలు... ప్రయాణికులు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.