ETV Bharat / jagte-raho

ఐజ పురపాలికలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

author img

By

Published : Nov 15, 2020, 7:37 PM IST

A women suicide in suspected stage in jogulamba gadwal dist
ఐజ పురపాలికలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పురపాలికలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పురపాలికలో ఓ మహిళ ఫ్యాన్​కు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక టీచర్స్ కాలనీలో ఉండే లిల్లీ(23) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

ఐజ మండలం భూమ్​పురం గ్రామానికి చెందిన వికాస్, ఖమ్మం జిల్లాకేంద్రానికి చెందిన లిల్లీ హైదరాబాద్​లో ప్రేమ వివాహం చేసుకున్నారు. లాక్​డౌన్​ నుంటి ఐజలోని టీటర్స్ కాలనీలో నివాసముంటున్నారు. మృతురాలు ఆరునెలల గర్భీణీగా పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నది ఒడ్డున పార్టీ... ఇద్దరు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.