ETV Bharat / jagte-raho

గోదావరిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

author img

By

Published : Sep 25, 2020, 10:38 AM IST

జీవితంపై విరక్తి పుట్టి.. బతకలేక ఓ వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్​ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

a old man committed suicide in nirmal district
గోదావరిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి బక్కన్న (70) అనే వృద్ధుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బక్కన్న నదిలోకి దూకగానే గమనించిన స్థానికులు కాపాడడానికి ప్రయత్నించారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాలేదు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో చెట్టుకు వేలాడుతూ వృద్ధుని మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.