ETV Bharat / jagte-raho

తేనెటీగల దాడి... వ్యక్తి మృతి

author img

By

Published : Nov 13, 2020, 5:54 PM IST

తేనెటీగల దాడి... వ్యక్తి మృతి
తేనెటీగల దాడి... వ్యక్తి మృతి

దేవాలయంలో పూజ చేస్తుండగా ఓ వ్యక్తిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దజట్రంలో జరిగింది.

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దజట్రంలో జరిగింది. గ్రామానికి చెందిన జయసింహా రెడ్డి తన పొలానికి సమీపంలోని హనుమాన్ దేవాలయంలో పూజ చేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి.

తీవ్రంగా గాయపడిన జయసింహారెడ్డి మృతి చెందాడు. ఆయనతోపాటు నలుగురు కుటుంబ సభ్యులను తేనెటీగలు కుట్టాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: బహుమతులు ఆశచూపుతాడు.. బంగారం దోచేస్తాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.