ETV Bharat / jagte-raho

విశాఖలో రూ.3.85 కోట్ల గంజాయి స్వాధీనం, భద్రాచలం నుంచే లోడింగ్

author img

By

Published : Dec 24, 2020, 7:22 AM IST

ఏపీలోని విశాఖ జిల్లాలో డీఆర్‌ఐ‌ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో అగనంపూడి టోల్​గేట్ వద్ద కాపు కాసిన సిబ్బంది... టాటా కంటైనర్​ ట్రక్​లో సరకును గుర్తించారు. డ్రైవర్​ను అరెస్టు చేశారు.

ganja
విశాఖ జిల్లాలో రూ.3.85 కోట్ల గంజాయి స్వాధీనం

విశాఖ జిల్లాలో 1,925 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు తెలిపారు. ఈ నెల 21న టాటా కంటైనర్‌ ట్రక్‌లో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. నిఘా పెట్టి విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేటు దగ్గర ఆ వాహనాన్ని గుర్తించామని వెల్లడించారు.

గంజాయి రవాణాకు వీలుగా డ్రైవర్‌ సీటు వెనక, పై భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించారని తెలిపారు. భద్రాచలంలో ఆ ట్రక్‌ను లోడ్‌ చేసి అలహాబాద్‌ తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గంజాయి విలువ 3.85 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.

ఇవీచూడండి: కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.