ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని భారత్- అరబ్ లీగ్ దేశాలు పిలుపునిచ్చాయి. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు ఇరు దేశాల మధ్య లోతైన సహాయ సహకారాలు అవసరం పేర్కొన్నాయి.
భారత్- అరబ్ సహకార ఫోరం తృతీయ శ్రేణి సీనియర్ అధికారుల మధ్య మంగళవారం దృశ్య మాధ్యమ సమీక్ష జరిగింది. అందులో భారత్- అరబ్ లీగ్ దేశాల మధ్య వాణిజ్యం మరింత బలోపేతమవ్వాలని ప్రతిన పూనాయి. సముద్ర సంబంధింత వాణిజ్య భద్రతపై దృష్టిసారించాలని నిర్ణయించాయి. అంతేకాకుండా నావిగేషన్ విషయంలో మరింత స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నాయి.
దేశీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారం కోసం అరబ్- భారత్ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాలని స్పష్టం చేశాయి. ప్రపంచ శాంతి కోసం లీగ్ దేశాలు, భారత్తో కలిసి పనిచేయాలని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మధ్య ఆసియాలో నెలకొన్న పాలస్తీనా సమస్య, సిరియా, లిబియా, యెమెన్లో నెలకొన్న సంక్షోభాల్ని ప్రస్తావించి వాటికి తగిన రాజకీయ పరిష్కారాల్ని సూచించాలని పునరుద్ఘాటించాయి.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరులో కొన్ని దేశాలది ద్వంద్వ వైఖరి'