ETV Bharat / international

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 23 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 3:52 PM IST

Updated : Jan 17, 2024, 7:15 PM IST

Thailand Bomb Blast Today : బాణసంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు ధాటికి సుమారు 23 మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్​ థాయిలాండ్​లో జరిగింది.

Thailand Bomb Blast Today
Thailand Bomb Blast

Thailand Bomb Blast Today : సెంట్రల్​ థాయిలాండ్​లోని బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించి సుమారు 23 మంది మరణించారు. రాజధాని బ్యాంకాక్​కు వాయువ్య దిశలో 90 కి.మీల దూరంలోని సుఫాన్​ బురీ ప్రావిన్సులో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, ఘటన జరిగిన సమయంలో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. అయితే ఫిబ్రవరిలో జరిగే చైనా నూతన ఏడాదిని పురస్కరించుకొనే డిమాండ్​కు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా తయారీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది నవంబర్​లోనూ జరిగిన బాంబు పేలుడులో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.

నైజీరియాలో భారీ పేలుడు-ముగ్గురి మృతి
Nigeria Bomb Blast :
మరోవైపు ఆఫ్రికా దేశం నైజీరియాలోనూ బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 77 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

10 మంది మృతి
ఇక గతేడాది జులైలో కూడా థాయిలాండ్​లోనే ఓ బాణసంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. నరాతీవత్​ ప్రావిన్సులో జరిగిన ఈ పేలుడులో ఫ్యాక్టరీకి సుమారు 500 మీటర్ల పరిధిలో ఉన్న 100 వరకు ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. గోదాములో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా జరిపిన మెటల్​ వెల్డింగ్​ నుంచి వచ్చిన నిప్పురవ్వలతో లోపల నిల్వ ఉంచిన బాణసంచాకు మంటలు అంటుకుని పేలుడు సంభవించి ఉంటుందని నరాతీవత్ గవర్నర్​ తెలిపారు.

103 మంది దుర్మరణం
Iran Bomb Blast : ఈనెల 3న ఇరాన్‌లో కూడా రెండు వరుస బాంబు పేలుళ్లు 103 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ఘటనలో 188 మంది గాయపడ్డారు. 2020లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో జనరల్ ఖాసీం సులేమానీ చనిపోగా ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. జనరల్ ఖాసిమ్ సమాధి వద్దకు వందలాది మంది ఆయన అభిమానులు నడుచుకుంటూ వెళుతుండగా ఈ పేలుళ్లు జరిగాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇది ఉగ్రవాద దాడేనని కెర్మన్ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

మరింత తగ్గిన చైనా జనాభా- 2023లో భారీగా మరణాలు

పాక్​లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి - ఇద్దరు చిన్నారులు మృతి!

Last Updated :Jan 17, 2024, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.