ట్రక్కును ఢీకొన్న విమానం.. ఐదుగురు దుర్మరణం

author img

By

Published : Apr 21, 2022, 7:50 AM IST

small plane crashes into soda truck in Haiti

Plane Crash: చిన్న సైజు విమానం సోడా ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైతి రాజధాని పోర్ట్​ అవ్​ ప్రిన్స్​లో ఈ దుర్ఘటన జరిగింది.

Plane Crash News: హైతి రాజధాని పోర్ట్ అవ్​ ప్రిన్స్​లో ఘోర ప్రమాదం జరిగింది. చిన్న సైజు విమానం.. సోడా బాటిళ్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విమానం జాక్మెల్ సౌథర్న్​ కోస్టల్ సిటీకి వెళ్లే క్రమంలో ఓ చోట ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన పైలట్​ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. విమానం సీటింగ్ కెపాసిటీ ఐదు మాత్రమే అని చెప్పారు.

ఈ ఘటనపై హైతి ప్రధాని ఏరియల్ హెన్రీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిశాక హృదయం బరువెక్కిందని ట్వీట్​ చేశారు. బాధితుల కుటంబాలకు సంతాపం తెలిపారు. సరిగ్గా 9 నెలల క్రితం జాక్మెల్ వెళ్తున్న ఓ విమానం కూడా పోర్ట్ అవ్​ ప్రిన్స్​లోనే ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు అమెరికా మిషనరీస్​ ఉన్నారు. కిడ్నాప్​లు, ముఠా తగాదాలు పెరుగుతున్న క్రమంలో పోర్ట్​ అవ్​ ప్రిన్స్​ నుంచి చిన్నసైజు విమానాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లడం హైతిలో సాధారణంగా మారింది. ప్రత్యేకించి మార్టిసాంట్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది.

ఇదీ చదవండి: రష్యా గుప్పిట్లో మరియుపోల్.. 'మాకు ఇవే చివరి రోజులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.