ETV Bharat / international

పాక్​లో భారీ వర్షాలకు 25 మంది బలి.. అతి తీవ్ర తుపానుగా 'బిపోర్​ జాయ్​'

author img

By

Published : Jun 11, 2023, 10:19 AM IST

Updated : Jun 11, 2023, 10:36 AM IST

Pakistan Heavy Rains : పాకిస్థాన్​లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాల కారణంగా 25 మంది మరణించగా.. సుమారు 145 మంది గాయపడ్డారు. స్తంభాలు కూలడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

Pakistan Heavy Rains
Pakistan Heavy Rains

Pakistan Heavy Rains : పాకిస్థాన్​లో కురిసిన భారీ వర్షాలకు 25 మంది పౌరులు మరణించారు. మరో 145 మంది గాయాలపాలయ్యారు. వాయవ్య పాకిస్థాన్​లో భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా చెట్లు, కరెంట్​ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని సీనియర్ రెస్క్కూ ఆఫీసర్​ ఖటీర్ అహ్మద్​ తెలిపారు. ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లోని బన్ను, లక్కి మర్వాత్​, కరక్ జిల్లాలో భారీగా వర్షాలు పడినట్లు ఆయన చెప్పారు. నిర్వాసితులకు అత్యవసర సాయం అందించి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Pakistan Heavy Rains
తుపాను కారణంగా నిలిచిపోయిన పడవలు

ప్రధాని షరీఫ్ విచారం
వరదల్లో చిక్కుకుని 25 మంది మృతి చెందడం పట్ల ఆ దేశ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ విచారం వ్యక్తం చేశారు. సహయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అరేబియా సముద్రంలో వచ్చిన బిపోర్​ జాయ్​​ తుపాను తీరాన్ని తాకనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుపాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దక్షిణ పాకిస్థాన్​ వైపు దూసుకు వస్తున్నట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది.

Pakistan Heavy Rains
తుపాను కారణంగా నిలిచిపోయిన పడవలు
Pakistan Heavy Rains
తుపాను కారణంగా నిలిచిపోయిన పడవలు

గతేడాది 1,700 మంది బలి
Pakistan Floods 2022 : గతేడాది కూడా పాకిస్థాన్​ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ​ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదల్లో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1,700 మందికి పైగా మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.

అతి తీవ్ర తుపానుగా 'బిపోర్​ జాయ్​'
Biporjoy Cyclone Latest News : మరోవైపు, అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన బిపోర్‌ జాయ్‌ అతి తీవ్ర తుపానుగా ఆదివారం ఉదయం మారిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోందని, జూన్ 15 నాటికి పాకిస్థాన్​లోని కరాచీ సహా, సమీపాన ఉన్న గుజరాత్​లోని సౌరాష్ట్ర, కచ్‌ తీరాలను తాకే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ముంబయికి దక్షిణంగా 610 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సౌరాష్ట్ర, కచ్‌ తీర ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ ప్రాంతంలో తీరాన్ని తాకనుందనే విషయంపై.. త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పింది.

  • VSCS BIPARJOY intensified into an ESCS at 0530IST today, about 480 km SSW of Porbandar, 530 km SSW of Dwarka and 610 km SSW of Naliya . To cross Saurashtra & Kutch and adj. Pakistan coasts bw Mandvi, Gujarat and Karachi, Pakistan around noon of 15th June as VSCS. pic.twitter.com/AZsK1Wqzqi

    — India Meteorological Department (@Indiametdept) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి : పాక్​ను ముంచెత్తిన వరద, 982 మంది బలి, నిరాశ్రయులైన 3.3 కోట్ల మంది

సగానికిపైగా పాకిస్థాన్‌ వరదలోనే, 1100 దాటిన మృతులు, మోదీ ఏమన్నారంటే

Last Updated : Jun 11, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.