ETV Bharat / international

'ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆకలికేకలు.. బిగిస్తున్న ఊబకాయం'.. ఐరాస నివేదిక

author img

By

Published : Jul 8, 2022, 7:55 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న సంఖ్య గణనీయంగా పెరిగిందని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది. గతం కంటే భారత్​లో ఊబకాయ బాధితుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న సంఖ్య మాత్రం తగ్గిందని పేర్కొంది.

FGN12-UN-HUNGER-INDIA
FGN12-UN-HUNGER-INDIA

పోషకాహార లోపం కోరల్లోంచి భారత్‌ క్రమంగా బయటపడుతున్నట్లు కనిపిస్తోంది! గత 15 ఏళ్లలో దేశంలో పోషకాహార లోపం బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 2004-06 మధ్య దేశ జనాభాలో వారు 21.6% ఉండగా.. 2019-21 నాటికి 16.3 శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే భారతావనిలో ఊబకాయ వయోజనులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగినట్లు పేర్కొంది.

'ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార స్థితి-2022' పేరుతో ఐరాస పరిధిలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఏడీ), యునిసెఫ్‌, ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఉమ్మడిగా ఈ నివేదికను విడుదల చేశాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ఊబకాయుల సంఖ్య, పోషకాహార లేమి సమస్య వంటి అంశాల గురించి అందులో పలు కీలక అంశాలు తెలియజేశారు. తాజా నివేదిక ప్రకారం..

FGN12-UN-HUNGER-INDIA
.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆకలికేకలు
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య 2021లో 82.8 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.6 కోట్ల మేర అధికం. కొవిడ్‌ మహమ్మారి ప్రారంభమయ్యాక మొత్తంగా ఈ జాబితాలో 15 కోట్ల మంది అదనంగా చేరడం గమనార్హం.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15767119_eeee.jpg
.

ఇవీ చదవండి: అప్పుడు 'వన్​ మ్యాన్​ షో'తో అఖండ విజయం.. ఇప్పుడు అతివిశ్వాసంతో రాజకీయ పతనం!

బ్రిటన్​ రాజకీయాన్ని మార్చేసిన 'మూర్తి గారి అల్లుడు'.. ప్రధాని రేసులో ముందంజ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.