కరోనా వైరస్కు హెర్డ్ ఇమ్యూనిటీ (మంద రోగ నిరోధక శక్తి) సాధించే అవకాశాలు చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందుకు అవసరమైన స్థాయిలో ప్రజల్లో ప్రతినిరోధకాలు లేవని తెలిపింది. అందువల్ల హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు పెట్టుకోలేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ డాక్టర్ మైఖేల్ రియాన్ స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి జనాభాలో కనీసం 70 శాతం మందికి ప్రతిరోధకాలు ఉండాలని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సగం మందికి రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ సాధించవచ్చని మరికొందరు వాదిస్తున్నారు.
వ్యాక్సినేషన్తో..
ప్రస్తుతం ఉన్న అధ్యయనాల ప్రకారం కరోనాకు 10 నుంచి 20 శాతం మందిలోనే యాంటీబాడీలు ఉండవచ్చని తెలిపారు. ప్రపంచ జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సిన్ అందివ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ సలహాదారు డాక్టర్ బ్రూస్ ఐల్వార్డ్ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా ఉద్ధృతి: మిలియన్ జనాభాలో 100 మంది మృతి