'మాకు స్వేచ్ఛ కావాలి'- కరోనా ఆంక్షలపై ప్రజల నిరసన

author img

By

Published : Nov 22, 2021, 12:43 AM IST

Updated : Nov 22, 2021, 2:16 AM IST

d

కరోనా ఆంక్షలపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ పలు దేశాల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు. బెల్జియంలో జరిగిన (Belgium Coronavirus Restrictions) నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. డచ్​లో ఇప్పటివరకు 51 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మరోవైపు సోమవారం నుంచి ఆంక్షలు అమలు కానున్న నేపథ్యంలో ఆస్ట్రియాలో ప్రజలు ఆదివారం మార్కెట్లకు పోటెత్తారు.

కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరోసారి ఆంక్షలను కట్టుదిట్టం చేస్తున్నాయి. అయితే దీనిపై పలు దేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ బెల్జిజంలో (Belgium Coronavirus Restrictions) వేల సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని బ్రసెల్స్​లో (Belgium Coronavirus Restrictions) ఆదివారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా 'ఫ్రీడం.. ఫ్రీడం' అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

Belgium Coronavirus Restrictions
ఆంక్షలను నిరసిస్తూ ర్యాలీ

పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై (Belgium Coronavirus Restrictions) నిరసనకారులు రాళ్లు రువ్వారు. కార్లను ధ్వంసం చేయడం సహా అక్కడున్న చెత్తకుండీలకు నిప్పంటిచారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు.

Belgium Coronavirus Restrictions
నిరసన తెలుపుతున్న ప్రజలు
Belgium Coronavirus Restrictions
నిరసనకారులపై జలఫిరంగులను ప్రయోగిస్తున్న పోలీసులు

నిరసన హింసాత్మకంగా మారగనే అక్కడున్న వారిలో దాదాపు 35వేల మంది తిరిగి వెళ్లిపోయారని అధికారులు వెల్లడించారు. ఈ హింసలో గాయపడిన పోలీసుల సంఖ్యపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు. అరెస్ట్​ అయిన నిరసనకారుల సంఖ్యపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

డచ్​లోనూ...

కరోనా ఆంక్షలపై నెదర్​లాండ్స్​లోనూ నిరసనలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పలు చోట్ల స్థానిక యువత వాహనాలను ధ్వంసం చేయడం సహా రోడ్లపై నిప్పు పెట్టారు. ఇప్పటివరకు 51 మందిని అధికారులు అరెస్ట్​ చేశారు.

ఆంక్షలకు ముందు..

ఆస్ట్రియాలో సోమవారం నుంచి లాక్​డౌన్​ అమలు కానున్న నేపథ్యంలో ఆదివారం మార్కెట్లు కిక్కిరిసాయి. ప్రజలంతా కాఫీ షాపులకు, క్రిస్మస్​ షాపింగ్​ల కోసం మార్కెట్లకు పోటెత్తారు.

కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం నుంచి లాక్​డౌన్​ను చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పది రోజుల పాటు ఉండే ఈ ఆంక్షలు.. వైరస్​ ఉద్ధృతి బట్టీ మరో 10 రోజులు పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : కొవిడ్ నిబంధనలు మాకొద్దని రోడ్డెక్కిన వేలమంది

Last Updated :Nov 22, 2021, 2:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.