ETV Bharat / international

Glasgow COP26: గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని మోదీ- ఘనస్వాగతం

author img

By

Published : Nov 1, 2021, 7:07 AM IST

బ్రిటన్​లోని గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి.. ఘనస్వాగతం పలికారు అక్కడి అధికారులు. అనంతరం హోటల్​కు చేరుకున్న మోదీకి భారత సంతతి ప్రజలు వినూత్నంగా ఆహ్వానించారు.

PM Modi
ప్రధాని మోదీ

బ్రిటన్​లోని గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో అక్కడి అధికారులు స్వాగతం పలుకగా.. అక్కడ నుంచి హోటల్​ చేరుకున్న మోదీకి బ్యాండుతో ఘనంగా ఆహ్వానించారు అక్కడి భారత సంతతి ప్రజలు. 'మోదీ హై భారత్​ కా జహ్నా(భారత్​కు మోదీ ఆభరణం)' అంటూ నినాదాలు చేశారు. దీంతో హోటల్​లో సందడి నెలకొంది. ఈ క్రమంలో మోదీ వారితో కాసేపు మోదీ ముచ్చటించారు.

pm modi in Glasgow
గ్లాస్గోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
pm modi in Glasgow
గ్లాస్గోలో మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు
pm modi in Glasgow
గ్లాస్గోలో హోటల్​కు చేరుకున్న ప్రధాని

కాప్​26 వాతావారణ సదస్సులో (Glasgow environmental conference) పాల్గొనేందుకు ప్రధాని.. గ్లాస్గో వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​తో (Glasgow meeting climate) ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

pm modi in Glasgow
ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్న భారత సంతతి ప్రజలు
pm modi in Glasgow
భారత సంతతి ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం
pm modi in Glasgow
భారతి సంతతి ప్రజలతో ముచ్చటిస్తున్న మోదీ

అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్​ఏ)లో తమ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే దిశగా.. గ్లాస్గో సదస్సు వేదికగా.. భారత్​, బ్రిటన్​ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.