ETV Bharat / international

గాజా వివాదంపై ఓటింగ్​కు భారత్​ దూరం

author img

By

Published : May 28, 2021, 5:31 PM IST

Israel-gaza
గాజా, ఇజ్రాయెల్

ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపై దర్యాప్తునకు వేసిన తీర్మానానికి భారత్ దూరంగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఈ తీర్మానానికి 24 దేశాలు ఆమోదం తెలపగా.. 9 దేశాలు అసమ్మతి చూపాయి.

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఘర్షణల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు చేపట్టాలనే తీర్మానంపై జరిగిన ఓటింగ్​కు భారత్​ దూరంగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్​హెచ్ఆర్​సీ)లో వేసిన ఈ తీర్మానంపై భారత్​ సహా 13 దేశాలు స్పందించలేదు.

చైనా, రష్యా సహా 22 దేశాలు ఈ తీర్మానానికి ఆమోదం తెలపగా.. 9 సభ్య దేశాలు నిరాకరించాయి.

ఇటీవలే 11 రోజుల పాటు ఇజ్రాయెల్​, గాజాలోని హమాస్​ మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనా, తూర్పు జెరూసలెం, ఇజ్రాయెల్​లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై దర్యాప్తు జరిపేందుకు యూఎన్​హెచ్ఆర్​సీ సభ్య దేశాలు తీర్మానం వేశాయి.

ఇదీ చదవండి: పశ్చిమాసియాలో శాంతి విలసిల్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.