ETV Bharat / international

కరోనాతో సహజీవనం తప్పదా? ఇక టీకా రాదా?

author img

By

Published : May 18, 2020, 10:19 AM IST

European leaders weigh reopening risks without a vaccine
'వ్యాక్సిన్​ లేకుండా ఆంక్షలు సడలిస్తే ప్రమాదమే.. కానీ'

లాక్​డౌన్​ ఆంక్షల నుంచి ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఇంకా వ్యాక్సిన్​ అభివృద్ధి కాకుండా ఆంక్షలను సడలిస్తే ప్రమాదమని కొందరు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్​ వచ్చేంత వరకు ఆగలేమని.. కరోనాతో సహజీవనం చేయక తప్పదని మరికొందరు తేల్చిచెబుతున్నారు. అన్నీ తెలిసే రిస్క్​ తీసుకుంటున్నామంటున్నారు.

కరోనా వైరస్​తో సహజీవనం చేయక తప్పదని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంగీకరించాయి. అందువల్ల లాక్​డౌన్​ ఆంక్షలను సడలించి ప్రజలను బయటకు అనుమతిస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్​ అభివృద్ధి చేయడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో.. లాక్​డౌన్​ సడలింపు వల్ల ఉన్న లాభనష్టాలపై వివిధ దేశాల నేతల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం ఎదురుచూడలేమని.. ప్రజలు కరోనాతో జీవించడానికి అలవాటు పడాలని ఐరోపా నేతలు తేల్చిచెబుతున్నారు.

"లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తే కరోనా వైరస్​ విజృంభించే అవకాశం ఉంది. ఈ విషయం మాకు తెలుసు. కానీ వ్యాక్సిన్​ కోసం ఇటలీ ఎదురుచూడలేదు. అందుకే అన్నీ ఆలోచించి రిస్క్​ తీసుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే అసలెప్పటీకీ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించలేము."

--- గిసెప్పీ కాంటే, ఇటలీ ప్రధాని

వైరస్​కు వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే కరోనా వైరస్​కు అసలు వ్యాక్సిన్​ కనుగొనలేకపోవచ్చని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ అభిప్రాయపడ్డారు.

"వ్యాక్సిన్​ను కనుగొనడానికి కావాల్సింది అంతా చేస్తానని ముందే చెప్పాను. అయితే వ్యాక్సిన్​ను రూపొందించడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అయితే అసలు ఈ ప్రయత్నాలు విజయవంతమవుతాయని చెప్పలేము."

-- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు, మరణాలు నమోదైన అమెరికాలోని చాలా ప్రాంతాల్లో లాక్​డౌన్​ ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్​ పాలిత ఓహియో రాష్ట్రంలో బార్లు, బీచ్​లు రద్దీగా దర్శనమిస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్​ మైక్​ డివైన్​ ఆందోళన వ్యక్తం చేశారు.

"ఓహియోను ఆర్థిక కార్యకలాపాలకు తెరవాలని నిశ్చయించుకున్నాం. ఇప్పటికే 90 శాతం ఆర్థిక కార్యకలాపాలు నడుస్తున్నాయి. పునరుద్ధరణ జరగకపోతే చాలా ప్రమాదం అనుకున్నాం. కానీ ఈ రద్దీని చూస్తుంటే ఆర్థిక వ్యవస్థను తెరిచినా ప్రమాదమే."

-- మైక్ డివైన్​, ఓహియో గవర్నర్​.​

లాక్​డౌన్​ను ఎక్కువ రోజులు పాటు అమలు చేస్తే ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతాయని అమెరికా ఆరోగ్యశాఖ అధికారి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అనేకమంది ఆత్మహత్యకు పాల్పడవచ్చని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.