ETV Bharat / international

ఉగ్రవాదం నిర్మూలనకు 'షాంఘై' దేశాల తీర్మానం!

author img

By

Published : Jun 24, 2021, 10:19 AM IST

Updated : Jun 24, 2021, 11:12 AM IST

షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు తజకిస్థాన్​ దుషాన్‌బేలో బుధవారం సమావేశమయ్యారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సహా బహుళజాతి వ్యవస్థీకృత నేరాలపై కలిసికట్టుగా పోరాడాలని ప్రమాణం చేశారు.

against terrorism
ఉగ్రవాదం నిర్మూలన

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ) సభ్యదేశాలు తజకిస్థాన్​లోని దుషాన్​బేలో సమావేశమయ్యాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం, వేర్పాటువాదంపై కలిసి పోరాడాతామని సభ్యదేశాల జాతీయ భద్రతా సలహాదారులు ప్రమాణం చేశారు. అంతేకాకుండా మత ఉగ్రవాదం, ప్రణాళిక ప్రకారం జరిగే నేరాలు, డ్రగ్​ మాఫియా తదితర సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని చర్చించారు.

ప్రాంతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎస్​సీఓ ప్రణాళిక..సభ్యదేశాలలో భద్రతను, బంధాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. ఈ సమావేశానికి భారత్​ తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​​ హాజరయ్యారు.

ఇదీ చదవండి: Universal Vaccine: అన్ని వైరస్‌లపై..ఒకే ఆయుధం!

Last Updated :Jun 24, 2021, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.