ETV Bharat / international

నగదు కొరత- బ్యాంకుల ముందు జనం బారులు!

author img

By

Published : May 30, 2021, 11:13 AM IST

Myanmar facing cash shortage
మయన్మార్​లో నగదు కొరత

మయన్మార్​లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, సైనిక ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఆ దేశం.. ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంది. బ్యాంకుల్లో నగదు కొరత వేధిస్తోంది. ఫలితంగా అక్కడి వస్తు సేవల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఓ వార్తా సంస్థ తెలిపింది.

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న క్రమంలో నగదు కొరత వేధిస్తోంది. భవిష్యత్​ అవసరాల దృష్ట్యా బ్యాంకుల్లో దాచుకున్న సేవింగ్స్​ను అక్కడి ప్రజలు అధిక మొత్తంలో విత్​డ్రా చేస్తున్నందున ఈ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా వస్తు సేవల ధరలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

ఫిబ్రవరి 1న ఆంగ్​ సాన్​ సూకి నేతృత్వంలోని పౌర ప్రభుత్వాన్ని కూలదోసి.. సైనిక ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి మయన్మార్​లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితులను జుంటా నేతృత్వంలోని సైనిక ప్రభుత్వం ఏమాత్రం పరిష్కరించలేకపోయిందని క్యోడో వార్తా సంస్థ​ నివేదించింది. దేశంలోని పెద్ద నగరమైన యాంగూన్​లో.. ప్రజలు ఉదయం వేళల నుంచే నగదు కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న దృశ్యాలు ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

నగదు ఉపసంహరణపై పరిమితులు..

సైనిక పాలనలో ఆ దేశంలోని బ్యాంకులన్నీ అంతంతమాత్రంగానే నడిచాయి. నిరసనల్లో పాల్గొంటున్నందున బ్యాంకు ఉద్యోగులు విధులకు హాజరు కావటం లేదు. అయితే.. ఇప్పుడిప్పుడే క్రమంగా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నప్పటికీ.. నగదు ఉపసంహరణపై సైనిక ప్రభుత్వం పరిమితులు విధించింది. ఎలాగోలా బ్యాంకుల నుంచి నగదును తెచ్చుకున్నవారు.. బ్లాక్​మార్కెట్​లో వాటిని అమెరికా డాలర్లుగా మార్చుకుంటారని, తమ ఇళ్లలో దాచుకుంటున్నారని చెప్పింది. నగదు కొరత నేపథ్యంలో.. తమ జవాన్లకు కూడా సైనిక ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందని పేర్కొంది.

మరోవైపు మయన్మార్​లో తలెత్తిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 800మందికి పైగా మరణించారు. మరో 4,330 మంది జైలు పాలయ్యారు.

ఇదీ చూడండి: 'మయన్మార్​కు సివిల్ వార్​ ముప్పు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.