'అఫ్గాన్​లో సమ్మిళిత ప్రభుత్వం కోసం తాలిబన్లతో చర్చించా'

author img

By

Published : Sep 19, 2021, 7:22 AM IST

Pak PM Imran

అఫ్గానిస్థాన్​లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లతో(Afghanistan Taliban) చర్చించినట్లు వెల్లడించారు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan on Taliban). ఆ దేశం నుంచి బలగాలను ఉపసంహరించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరైన పనే చేశారని అన్నారు.

అఫ్గానిస్థాన్​లో సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లతో(Afghanistan Taliban) చర్చించినట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan on Taliban) తెలిపారు. అందులో తజిక్​లు, హజారాలు, ఉజ్బెక్​లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. కొత్త సర్కారులో అన్ని జాతి, మత, రాజకీయ వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ)(SCO on Afghanistan) సభ్య దేశాలు నొక్కి చెప్పిన అనంతరం ఈ మేరకు చర్చలు జరిపారు ఇమ్రాన్.

ఆగస్టు మధ్యలో అఫ్గాన్​ను అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా సమ్మిళిత ప్రభుత్వాన్ని(Afghan government formation) ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 33 మంది సభ్యులున్న తాత్కాలిక కేబినెట్​లో ఒక్క హజారా సభ్యుడు గానీ, మహిళ గానీ లేరు. అయితే 20 సంవత్సరాల సంఘర్షణ తర్వాత అఫ్గాన్​లో శాంతి, సుస్థిరతలు నెలకొనబోతున్నాయని ఇమ్రాన్​​ ట్వీట్(Imran Khan twitter) చేశారు.

'బైడెన్​ను అన్యాయంగా విమర్శిస్తున్నారు'

అఫ్గాన్​ నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Imran Khan on america).. అన్యాయమైన విమర్శలు ఎదుర్కొంటున్నారని ఇమ్రాన్ అన్నారు. బైడెన్ చేసిన పని సరైనదేనని చెప్పారు. అఫ్గాన్​కు అంతర్జాతీయ సహాయం నిలిచిపోవడం వల్ల సంక్షోభం తలెత్తకుండా అమెరికా ఏదైనా వ్యూహం రూపొందించాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

మహిళలపై తాలిబన్ల ఉక్కుపాదం- ఏకంగా ఆ శాఖనే..!

అఫ్గాన్​లో వరుస పేలుళ్లు- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.