ETV Bharat / international

కరోనా కాటుకు 8 లక్షల 50వేల మంది బలి

author img

By

Published : Aug 31, 2020, 8:21 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య 2కోట్ల 54లక్షలకు చేరువవుతోంది. ఇప్పటివరకు 8లక్షల 50వేల మందికిపైగా వైరస్​కు బలయ్యారు. భారత్​, అమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

over 8 lakh 50 thousand people dead due to corona
కరోనా కాటుకు 8లక్షల 50వేల మంది బలి

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 2కోట్ల 53లక్షల 83వేల 379మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం 8లక్షల 50వేల 546మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కోటి 77లక్షల 4వేల 919మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా భారత్​లో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది.

కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..

దేశంకేసులుమరణాలు
1అమెరికా61,73,2361,87,224
2బ్రెజిల్38,62,3111,20,896
3భారత్35,42,73363,498
4రష్యా9,90,32617,093
5పెరు6,47,16628,788

ఇదీ చూడండి: అమెరికాలో కొవిడ్‌ టెస్టులపై గందరగోళం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.