ETV Bharat / international

అమెరికా చేతికి 'అఫ్గాన్​ సూపర్​ కమాండోలు'.. ఏ క్షణమైనా...

author img

By

Published : Sep 13, 2021, 5:13 PM IST

అమెరికా సీఐఏ శిక్షణ ఇచ్చిన అఫ్గాన్ కామాండోలు ఖతార్​ మీదగా అగ్రరాజ్యానికి చేరుకున్నారు(us army in afghanistan). వీరి సంఖ్య 20వేలకుపైగా ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా మోహరించేందుకు వీలుగా, ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉండే ఈ అఫ్గాన్​ కమాండోలు.. అగ్రరాజ్యానికి దక్కడం సానుకూలాంశం. మరి వీరితో అమెరికా ఎలాంటి ఆపరేషన్​ చేపడుతుంది?

Afghan commandos
అఫ్గాన్​ కమాండోలు

అఫ్గాన్​ యుద్ధం సమయంలో తాలిబన్లపై పోరాటానికి అమెరికా సీఐఏ(సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీ)(cia afghanistan).. అఫ్గాన్​ కమాండోలకు కఠిన శిక్షణ ఇచ్చింది. వీరు అమెరికాకు ఆయుధం లాంటి వారు(us afghan war). కానీ తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న అనంతరం వీరిని వేటాడటం మొదలుపెట్టారు. అయితే 20వేల మంది అఫ్గాన్​ కమాండోల్లో చాలా మంది అమెరికాకు తిరిగొచ్చినట్టు అధికారులు ఈటీవీ భారత్​కు వెల్లడించారు. వీరంతా అగ్రరాజ్యానికి ఓ 'రహస్య ఆయుధం'గా ఉపయోగపడతారని తెలిపారు.

"సీఐఏ శిక్షణనిచ్చి, తీర్చిదిద్దిన అఫ్గాన్​ ప్రత్యేక దళం కమాండోల్లో 90శాతం మంది ఖతార్​ మీదగా అమెరికాకు చేరుకున్నారు. యుద్ధవిచ్ఛిన్న దేశమైన అఫ్గాన్​ గురించి వీరికి ఎన్నో విషయాలు తెలుసు. ఎన్నో కీలక సమాచారాలు వీరి వద్ద ఉన్నాయి. వీరు తిరిగిరావడం అమెరికాకు సానుకూల అంశం. ఒకవేళ అఫ్గాన్​పై అమెరికా మిలిటరీ ఆపరేషన్​ చేపట్టాలంటే వీరి శక్తిసామర్థ్యాలు ఉపయోగపడతాయి."

--- అధికారులు.

ఎప్పుడైనా, ఎక్కడైనా మోహరించే విధంగా ఈ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పంజ్​షేర్​లో ఎన్​ఆర్​ఎఫ్​(నేషనల్​ రెసిస్టెన్స్​ ఫోర్స్​) తాలిబన్లతో పోరాడుతోంది. అవసరమైతే కమాండోలను అగ్రరాజ్యం అక్కడా మోహరించవచ్చు. అఫ్గాన్​ మాజీ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ హయాంలో అఫ్గాన్​ భద్రతా దళాన్ని ముందుండి నడిపించి, తాలిబన్లపై పోరాడింది(us taliban news) ఈ కమాండోలే. నేషనల్​ డైరక్టరేట్​ ఆఫ్​ సెక్యూరిటీ(ఎన్​డీఎస్​) పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహించారు. కార్యకలాపాలు సాగించే ప్రాంతాల బట్టి ఎన్​డీఎస్​-01, ఎన్​డీఎస్​-02, ఎన్​డీఎస్​-03, ఎన్​డీఎస్​-04గా విభాగాలుంటాయి. ఏ విభాగానికి తగ్గట్టు అందుకు సంబంధించిన ప్రత్యేక పనులుంటాయి.

most-of-20000-cia-trained-afghan-fighters-make-it-to-us
అమెరికా సైన్యం

"ఖోస్ట్​ రాష్ట్రంలో ఎన్​డీఎస్​ ఆధ్వర్యంలోని కమాండోలను కేపీఎఫ్​ అని పిలుస్తారు. తాలిబన్లపై వీరు చివరి తూటా వరకు పోరాడారు. చివరకు స్థానిక తాలిబన్లతో సంప్రదింపులు జరిపారు. అక్కడి నుంచి కాబుల్​ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి వారిని ఖతార్​కు తరలించింది అమెరికా."

-- అధికారులు.

అయితే ఈ కమాండోలు చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తుంటారని ఆరోపణలున్నాయి. అక్రమంగా హత్య చేయడం, హక్కుల ఉల్లంఘన, హింసకు పాల్పడుతుంటారని అప్రతిష్ఠ కూడా ఉంది.

మరోవైపు తాలిబన్ల ఆక్రమణతో దేశాన్ని వీడి ఉజ్బెకిస్థాన్​కు వెళ్లారు అఫ్గాన్​ వాయుసేన పైలట్లు. అక్కడి నుంచి వారు అమెరికా వాయుస్థావరమైన దోహాకు వెళ్లే అవకాశముంది. అక్కడి నుంచి తదుపరి ప్రణాళికలు రచిస్తారని సమాచారం. మొత్తం మీద 46 విమానాల్లో సైనిక సిబ్బంది, కుటుంబసభ్యులు, పైలట్లు వెళ్లారు.

వలసలు...

సైనికులే కాదు.. అఫ్గాన్​లోని అనేకమంది విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, జర్నలిస్టులు కూడా వలస వెళ్లిపోయారు. దేశంలోని మైనారిటీలు కూడా అఫ్గాన్​ నుంచి బయటపడ్డారు. ఒకప్పుడు అఫ్గాన్​లో 2లక్షల మంది హిందువులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుందని అంచనా.

(రచయిత- సంజీవ్​ కుమార్ బారువా)

ఇదీ చూడండి:- Afghan Crisis: అతడి కోసం తాలిబన్ల కళ్లుగప్పి అమెరికా రెస్క్యూ ఆపరేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.