ETV Bharat / international

'కమ్యూనిస్ట్​ పార్టీ నేతృత్వంలో దూసుకెళ్తోన్న చైనా'

author img

By

Published : Sep 4, 2020, 3:10 PM IST

china latest news
'కమ్యూనిస్ట్​ పార్టీ నేతృత్వంలో దూసుకెళ్తోన్న చైనా'

కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనా(సీపీసీ) చరిత్రను, ఆశయాలను మార్చాలని ఏ వ్యక్తి, ఏ సైనిక బలం ప్రయత్నించినా అందుకు చైనా ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్​. చైనా ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూస్తున్న అగ్రరాజ్యాన్ని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత చైనా కీలక నిర్ణయాలతో ప్రగతి పథంలో దూసుకెళ్తోందని జిన్​పింగ్​ పేర్కొన్నారు.

చైనా కమ్యూనిస్ట్​ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఉద్ఘాటించారు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​. ముఖ్యంగా అమెరికా నిరంకుశ భావజాలంతో దాడులు చేస్తున్నా, విమర్శలు గుప్పిస్తున్నా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. జపాన్​పై యుద్ధంలో విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం మాట్లాడారు జిన్​పింగ్​. కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనా(సీపీసీ) నుంచి చైనా ప్రజలను వేరు చేసేందుకు ఏ దేశం చేసే ప్రయత్నాలనైనా.. చైనా ప్రజలు, తాము తిప్పికొడతామని స్పష్టం చేశారు.

"జపాన్​పై యుద్ధంలో గెలిచాక చైనాలో అనేక మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా చైనా దూసుకుపోతోంది. పేదరిక నిర్మూలన, సంపన్న సమాజం నిర్మణమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది" అని జిన్​పింగ్​ చెప్పినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

ఇప్పటికే సీపీసీలో శక్తిమంతమైన నాయకుడిగా, అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగేందుకు జిన్​పింగ్​కు అధికారం ఉంది.

అలా చేస్తే ఒప్పుకోం...

భారత్​తో సరిహద్దు ఉద్రిక్తతలు, అమెరికా నుంచి రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు జిన్​పింగ్​. అమెరికా తన శక్తిని ఉపయోగించి బెదిరింపు వ్యూహాలకు పాల్పడుతోందని పరోక్షంగా విమర్శించారు. చైనా అభివృద్ధిని నియంత్రించాలని ఎవరు ప్రయత్నించినా అందుకు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.