ETV Bharat / international

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్​ఓ-చైనా పరిశోధన

author img

By

Published : Aug 4, 2020, 6:54 PM IST

కరోనా మహమ్మారి మూలాన్ని కనుగొనేందుకు ప్రణాళికలు రూపొందించే విషయంపై చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చలు జరిపాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు నిపుణులు చైనాలో.. రెండు వారాల పాటు సందర్శించారని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. వీరి పర్యటన ఆదివారంతో పూర్తయినట్లు పేర్కొంది.

China, WHO in talks on plans to trace coronavirus origin
కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్​ఓ-చైనా పరిశోధన

ప్రపంచాన్ని కకావికలం చేస్తోన్న కరోనా మహమ్మారి పుట్టుక గురించి తెలుసుకునేందుకు ప్రణాళికలు రూపొందించే విషయంపై చైనా-ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించాయి. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి నుంచి ఇద్దరు నిపుణులు తమ దేశంలో రెండు వారాలు పర్యటించారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్​బిన్​ తెలిపారు. వైరస్ మూలానికి సంబంధించి శాస్త్రీయ పరిశోధన సహకారంపై సన్నాహక సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

ఐరాస నిపుణులతో జనాభా, పర్యావరణం, అణువులు, జంతువులను గుర్తించడం, వైరస్​ వ్యాప్తికి సంబంధించిన విషయాలపై చర్చించినట్లు వాంగ్ చెప్పారు.

ఏ జంతువు నుంచి కరోనా మనుషులకు సోకి ఉటుందనే అంశంపైనా పరిశోధన జరిపినట్లు వివరించారు.

చైనాలోని వుహాన్​ నగరంలో కరోనా వైరస్​ ఉద్భవించింది. గబ్బిలాలు, అలుగులు వంటి అడవి జంతువుల నుంచి వైరస్ మనుషులకు వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా వల్ల ఇప్పుడు భారత్​కే అసలు సమస్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.