ETV Bharat / international

'భారత్​ నుంచి ఎగుమతైన గేదె మాంసంలో కరోనా!'

author img

By

Published : Jul 28, 2021, 2:32 PM IST

cambodia-seizes-virus-contaminated-meat-imported-from-india
'భారత్​ నుంచి ఎగుమతైన గేదె మాంసంలో కరోనా!'

భారత్​ నుంచి ఎగుమతి అయిన గేదె మాంసంలో కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు కంబోడియా ప్రభుత్వం ప్రకటించింది. సంబంధిత కంటైనర్లను సీజ్​ చేసి, సరకును నాశనం చేస్తున్నట్లు తెలిపింది.

భారత్​ నుంచి ఎగుమతి అయిన ఐదు కంటైనర్ల గేదె మాంసాన్ని కంబోడియా ప్రభుత్వం సీజ్ చేసింది. మూడు కంటైనర్లలోని మాంసంలో కరోనా ఆనవాళ్లు ఉండడమే ఇందుకు కారణమని వెల్లడించింది.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది ఆరంభంలో భారత్​ నుంచి మాంసం ఎగుమతుల్ని కంబోడియా నిషేధించింది. భారత్​లో కేసులు కాస్త తగ్గిన నేపథ్యంలో ఇటీవలే ఆ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థ భారత్​ నుంచి ఫ్రోజెన్ మీట్​ను కంబోడియాకు సరఫరా చేసింది. అయితే ఇందులో కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఆ మూడు కంటైనర్లలోని సరకును వారం రోజుల తర్వాత నాశనం చేస్తామని ప్రకటించారు.

కంబోడియాలో కరోనా క్రమంగా తీవ్రమవుతోంది. మంగళవారం 685 కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 74,386 మందికి కరోనా సోకగా.. 1,324 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి: డెల్టా పంజా- ప్రపంచదేశాల్లో మళ్లీ పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.