ETV Bharat / international

వెనక్కితగ్గిన ఆస్ట్రేలియా- ప్రయాణికులపై నిషేధం రద్దు!

author img

By

Published : May 7, 2021, 2:06 PM IST

భారత్​లో చిక్కుకుని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియన్లు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ పేర్కొన్నారు. మే 15 నుంచి 31 మధ్య కాలంలో మూడు విమానాల్లో ఆస్ట్రేలియన్లను తిరిగి తమ దేశానికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

travellers
ఆస్ట్రేలియా ప్రయాణికులు

భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధంలో సడలింపు లభించింది. గతంలో భారత్‌ నుంచి విమానాల రాకపోకలను మే 15 వరకు నిషేధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఒకవేళ ఎవరైనా వస్తే జైలుశిక్ష, జరిమానా తప్పదని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన నిర్ణయంపై కొంచెం వెనక్కి తగ్గారు. భారత్‌లో చిక్కుకుపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని శుక్రవారం వెల్లడించారు.

వచ్చే వారంతో ఈ నిషేధం ముగిశాక.. భారత్​ చిక్కుకున్న వారు తిరిగి వచ్చేలా విమానాలు నడపనున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం 9,000 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 900 మంది స్వదేశానికి వెళ్లేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు.

మూడు విమానాల్లో...

మే 15 నుంచి 31 మధ్య మూడు విమానాలు నడుపనున్నట్లు మారిసన్ తెలిపారు. వచ్చే శనివారం.. భారత్ నుంచి వెళ్లే మొదటి విమానం డార్విన్ సిటీలో దిగనున్నట్లు వెల్లడించారు. భారత్​ నుంచి ఇతర విమానాలు నడిపేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే భారత్‌ నుంచి వచ్చే వారిని క్వారెంటైన్‌ చేయించేందుకు ది హోవర్డ్‌ స్ప్రింగ్‌ క్వారెంటైన్‌ కేంద్రాన్ని వచ్చేవారానికి 2,000 పడకలతో విస్తరించనున్నారు.

ఇదీ చదవండి:'భారత్​కు సాయపడటం అమెరికా నైతిక బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.