ETV Bharat / international

'టీకా రాకపోతే ఆఫీసుకు వెళ్లేదెలా?'

author img

By

Published : Nov 27, 2020, 7:25 PM IST

కరోనాకు వ్యాక్సిన్​ రాని నేపథ్యంలో ఆఫీసుకు వెళ్లి పనిచేయడానికి 83శాతం ఉద్యోగులు సిద్ధంగా లేరని ఓ సర్వేలో తేలింది. అయితే కార్యాలయానికి వెళ్లి పనిచేయడానికి తమ కంపెనీలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు 88శాతం ఉద్యోగులు నమ్ముతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు అట్లేషియన్​ ఐటీ కంపెనీ ఓ సర్వే నిర్వహించింది.

Around 83 pc of Indian workforce nervous to go back to office without COVID-19 vaccine: Survey
ఆఫీసుకు వెళ్లి పనిచేయడానికి ఎంతమంది సిద్ధం?

మహమ్మారి కరోనా వ్యాప్తి ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. ఇప్పటికీ కొవిడ్​కు వ్యాక్సిన్​ రాలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన అట్లేషియన్​ ఐటీ కంపెనీ... భారత్​లో ఎంతమంది ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారనే దానిపై ఓ సర్వే నిర్వహించింది.

సర్వేలో వెల్లడైన అంశాలు ఇవే..

  • కొవిడ్​కు వ్యాక్సిన్ రాకపోవడం వల్ల ఆఫీసుకు వెళ్లి పనిచేయడానికి 83శాతం ఉద్యోగులు సుముఖంగా లేరు.
  • అయితే తిరిగి ఆఫీసుకెళ్లి పనిచేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను తమ కంపెనీలు చేసినట్లు 88శాతం ఉద్యోగులు భావిస్తున్నారు.
  • కరోనా సాకుతో వర్క్​ఫ్రమ్​హోం ఇవ్వడంపై 78శాతం మంది కోపంగా ఉన్నారు.
  • 86 శాతం మంది తమ బృందంలోని సభ్యులతో సంబంధాలు మెరుగుపడ్డాయని భావిస్తున్నారు.
  • 75 శాతం మంది తమ జట్టు.. కరోనా ముందుతో పోలిస్తే బాగా కలిసి పనిచేస్తోందని అనుకుంటున్నారు.
  • కరోనా కారణంగా షిఫ్ట్​ వారీగా పని చేయడం వల్ల ఉత్పాదకత, పని సామర్థ్యం కూడా పెరిగినట్లు మేనేజర్లు భావిస్తున్నారు.

కొవిడ్​-19 ముందుకంటే ప్రస్తుతం తమ ఉద్యోగాలకు భద్రత పెరిగిందని మేనేజర్​ స్థాయి వారు పేర్కొన్నారని అట్లేషియన్​ ఐటీ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

ఇదీ చూడండి: రణరంగంలా​ పార్లమెంట్​​- పంది మాంసంతో దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.