ETV Bharat / international

జర్మనీ కాల్పుల్లో తొమ్మిదికి చేరిన మృతులు

author img

By

Published : Feb 20, 2020, 5:21 AM IST

Updated : Mar 1, 2020, 10:08 PM IST

8-people-dead-in-germany-shooting-incident
జర్మనీలో కాల్పుల కలకలం

12:38 February 20

జర్మనీలోని హనావ్​ నగర కేంద్రంలో ఆగంతుకులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన అధికారులు.. తాజాగా మరొకరు మృతిచెందినట్లు వెల్లడించారు.

05:14 February 20

జర్మనీలోని హనావ్​ నగర కేంద్రంలోో ఆగంతుకులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. బుధవారం రాత్రి 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు హుక్కా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.  

హనావ్ నగరంలోని ఓ హుక్కా కేంద్రంలో కాల్పులు జరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. 8 నుంచి 9  సార్లు కాల్పుల శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పేర్కొంది. అక్కడి నుంచి దుండగులు మరో హుక్కా కేంద్రానికి వెళ్లి మరోసారి కాల్పులకు తెగబడినట్లు వార్తలను ప్రసారం చేసింది.

Last Updated :Mar 1, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.