బోటు ప్రమాదంలో 10 మంది దుర్మరణం

author img

By

Published : Sep 19, 2021, 12:22 PM IST

Updated : Sep 19, 2021, 7:30 PM IST

boat

ఓ బోటు ప్రమాదంలో 10 మంది మృతిచెందగా ఐదుగురు గల్లంతయ్యారు. చైనా గుయీజ్​హూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

చైనా గుయీజ్​హూ ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.50 గంటలకు జంజ్​కే నదిలో ఈ బోటు బోల్తా పడినట్లు తెలిసింది. 10 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. మరో 39 మందిని రక్షించారు. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.

వాస్తవానికి బోటులో 40 మందికి మాత్రమే అనుమతి ఉంది. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో అంతతంటే చాలా ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:China astronaut: అంతరిక్షంలో 90 రోజులు.. క్షేమంగా భూమిమీదకు..

Last Updated :Sep 19, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.