ETV Bharat / international

శ్వేతసౌధంలో కరోనా కలకలం.. ప్రెస్​ సెక్రటరీకి పాజిటివ్

author img

By

Published : Nov 1, 2021, 12:06 PM IST

వైట్​హౌస్ ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాకి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను అధ్యక్షుడు జో బైడెన్​ను గత వారం కలిశానని తెలిపారు.

అమెరికా
ప్రెస్​ సెక్రటరీకి పాజిటివ్

అమెరికాలోని శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపింది. తనకు కొవిడ్​ పాజిటివ్​ అని తేలినట్టు పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్​ సాకి వెల్లడించారు. శ్వేతసౌధంలోని సిబ్బంది ద్వారా తనకు వైరస్​ సోకినట్లు సాకి తెలిపారు. గతవారంలో చివర సారిగా అధ్యక్షుడు జో బైడెన్​ను మంగళవారం కలిసినట్టు సాకి వెల్లడించారు.

సాకి కూడా బైడెన్​తో పాటు ఐరోపా పర్యటనకు రావాల్సి ఉండగా.. ఆమె వద్ద పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకిందని తెలిసి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

"సిబ్బందికి కరోనా సోకిందని తెలిసి బుధవారం నుంచి క్వారంటైన్​లో ఉన్నాను. నాలుగు రోజుల పాటు నాకు నెగెటివ్​ వచ్చింది. కానీ ఇప్పుడు చేసుకున్న పరీక్షలో పాజిటివ్​గా తేలింది. అధ్యక్షుడు బైడెన్​తో కానీ, ఇతర ముఖ్య అధికారులతో కానీ ఎక్కువగా కలవలేదు."

-జెన్​ సాకి, శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి

తాను పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నానని.. వైరస్​కు సంబంధించి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు సాకి వెల్లడించారు. పది రోజుల క్వారంటైన్​ పూర్తి చేసుకుని.. పరీక్షల్లో నెగటివ్​ వచ్చాకే తిరిగి విధులకు హాజరవుతానని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : COP26 glasgow: సౌరశక్తి బదిలీ కోసం భారత్- యూకే ఒప్పందం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.