ETV Bharat / international

వారాంతంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి

author img

By

Published : Nov 28, 2021, 5:39 AM IST

usa
అమెరికా

అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఘటనా స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

వారాంతంలో అమెరికాలో కాల్పుల మోత మోగింది. నాష్‌విల్లేలోని టెన్నెస్సీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

'గుర్తుతెలియని దుండగులు అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా ప్రవేశించారని.. వారి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని' పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

బాధితుల పేర్లు, వయస్సు వివరాలను వెల్లడించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.