ETV Bharat / international

గోల్ఫ్​ కోర్టులో కాల్పులు- ముగ్గురు మృతి

author img

By

Published : Jul 5, 2021, 10:21 AM IST

Updated : Jul 5, 2021, 10:47 AM IST

US shoot
కాల్పులు

అమెరికాలో శనివారం జరిగిన కాల్పుల్లో(Firing) ఓ గోల్ఫ్​ క్రీడాకారుడు(golfer) సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కెన్నెషా స్టేట్​ యూనివర్శిటీకి సమీపంలోని పైనెట్రీ కంట్రీ క్లబ్​లో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఓ గోల్ఫ్​ క్రీడాకారుడు సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని కెన్నెషా స్టేట్​ యూనివర్శిటీకి సమీపంలోని పైనెట్రీ కంట్రీ క్లబ్​ గోల్ఫ్​ కోర్టులో కాల్పులు జరిగాయి. పదో నంబరు హోల్​ వద్ద బుల్లెట్​ గాయాలతో(Gunshot) ఆ గోల్ఫ్​ క్రీడాకారుడు విగతజీవిగా పడిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆయన్ని కంట్రీ క్లబ్​లో ఉద్యోగి యూజీన్​ సిల్లర్​గా తేల్చారు. దీంతో సిల్లర్​ మరణం పట్ల జార్జియాలోని గోల్ఫ్​ అసోసియేషన్​ ఆఫ్​ అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. తమ క్రీడా కుటుంబం ఓ సభ్యుడుని కోల్పోయినట్లు పేర్కొంది.

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదానంలోని ఓ ట్రక్కులో బుల్లెట్​ గాయాలతో పడిఉన్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు ట్రక్కు యజమాని కాగా.. మరో వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: యుద్ధం లేకుండానే తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్

Last Updated :Jul 5, 2021, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.