ETV Bharat / international

హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

author img

By

Published : Sep 11, 2020, 11:51 AM IST

కొలంబియాలో పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు పౌరులు మరణించారు.

Protests in Colombia over death in police custody
హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

కొలంబియా రాజధాని బొగోటాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి... పౌరులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతి చెందారు.

Protests in Colombia over death in police custody
నిరసన జ్వాలలతో అట్టుడుకుతున్న కొలంబియా
Protests in Colombia over death in police custody
ఆందోళనల్లో పాల్గొన్న యువత

పోలీసుల అమానుష ప్రవర్తన కారణంగా 43 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఆయన మృతికి సంఘీభావంగా నిరసనలు చెలరేగాయి.

Protests in Colombia over death in police custody
పోలీస్​స్టేషన్​కు నిప్పు అంటిస్తున్న దృశ్యం
Protests in Colombia over death in police custody
పూర్తిగా దహనమైన సిటీ బస్సు
Protests in Colombia over death in police custody
పోలీసులపై రాయి విసురుతున్న ఆందోళనకారుడు

పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయిన పౌరులు... 8 సిటీ బస్సులను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. స్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 175 మంది పౌరులు గాయపడ్డారు. నిరసనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువత కావడం గమనార్హం. నిరసకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు, రబ్బరు బల్లెట్లు ఉపయోగించారు పోలీసులు.

Protests in Colombia over death in police custody
పోలీసు స్టేషన్​పై దాడి చేస్తున్న నిరసనకారులు
హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

ఇదీ చూడండి: 'ఉగ్రమూకలపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.