'అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా'లో ప్రధాని మోదీ

author img

By

Published : Sep 15, 2021, 8:27 PM IST

time 100 most influential 2021

అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి మరోమారు చోటు దక్కింది. భారత్​ తరఫున ప్రధాని మోదీ సహా బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా జాబితాలో ఉన్నారు.

టైమ్‌ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చోటు దక్కించుకున్నారు. 2021కి గానూ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను బుధవారం విడుదల చేసింది టైమ్​ మ్యాగజైన్​. 18వ వార్షిక జాబితాలో మార్గదర్శకులు, కళాకారులు, నాయకులు, ఆవిష్కర్తలతోపాటు తదితరులు ఉన్నట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాాలాకు కూడా చోటుదక్కింది.

ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కురాలిగా 18 ఏళ్ల జిమ్నాస్ట్​ సునీసా లీ ఉండగా.. పెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంపికయ్యారు.

ఇదే జాబితాలో అప్గాన్‌ ప్రధాని అబ్దుల్ బరాదర్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ-మేఘన్, జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, నటి కేట్ విన్స్‌లెట్, సింగర్, పాటల రచయిత బిల్లీ ఎలిష్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డీజీ ఎన్‌గోజీ, ఎన్విడియా సీఈఓ హువాంగ్, రచయిత కాథీ పార్క్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది.

ఇదీ చూడండి : ఐరాస వేదికగా పాక్​కు భారత్​ చురకలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.