ETV Bharat / international

కరోనా పంజా: న్యూయార్క్​లో 24 గంటల్లో రికార్డ్​ మరణాలు

author img

By

Published : Apr 9, 2020, 5:45 AM IST

Updated : Apr 9, 2020, 8:51 AM IST

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా.. న్యూయార్క్​లో ఉగ్రరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 779 మంది వైరస్​కు బలయ్యారు. అమెరికాలో మహమ్మారి బాధితుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఫ్రాన్స్​లోనూ బుధవారం 541 మందిని వైరస్ బలిగొంది.

NYC virus deaths exceed 4,000, topping toll for 9/11 attacks
కరోనా ఉగ్రరూపం: న్యూయార్క్​లో 24 గంటల్లో రికార్డ్​ మరణాలు

కరోనా పంజా: న్యూయార్క్​లో 24 గంటల్లో రికార్డ్​ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా అమెరికా,ఐరోపాలో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. న్యూయార్క్​లో వరుసగా రెండో రోజు అత్యధిక మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 779 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇవే అత్యధిక మరణాలు.

మంగళవారం 731 మందిని మహమ్మారి బలిగొంది. భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్​ హెచ్చరించారు.

అంతకుమించి...

ప్రస్తుతం న్యూయార్క్​లో వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య.. 9/11 దాడుల్లో చనిపోయిన వారి సంఖ్యను అధిగమించినట్లు రాష్ట్ర గవర్నర్ తెలిపారు​. ఉగ్రదాడిలో 2,753 మంది మరణించగా.. కరోనాకు 6,268 మంది బలైనట్లు పేర్కొన్నారు.

అమెరికాలో బుధవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 4 లక్షలు దాటింది. సుమారు 14 వేలమందికి పైగా వైరస్​తో మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ప్రప్రంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్​ దేశాలకు చేరువలో అమెరికా ఉంది.

70 శాతం అక్కడే...

ఫ్రాన్స్​లోనూ గత 24 గంటల వ్యవధిలో 541 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10,869 మందిని వైరస్​ పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం 7,148 మంది ఇంటెన్సీవ్​ కేర్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

60 వేలు దాటేసింది...

ఐరోపా​లో బుధవారం సాయంత్రం నాటికి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 60 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 70 శాతం ఐరోపాలోనే సంభవించాయని అధికారులు పేర్కొన్నారు.

Last Updated : Apr 9, 2020, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.