'జీనోమ్​ ఎడిటింగ్'​ పరిశోధకులకు నోబెల్​

author img

By

Published : Oct 7, 2020, 3:26 PM IST

Updated : Oct 7, 2020, 4:28 PM IST

Nobel prize in Chemistry has been awarded to Emmanuelle Charpentier and Jennifer A|. Doudna for developing a method on genome editing

జీనోమ్​ ఎడిటింగ్​ను అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​, జెన్నిఫర్​ ఏ డౌడ్నలకు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్​ పురస్కారం లభించింది. వీరికి.. బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు బహుమతి అందించనున్నారు.

2020 రసాయన శాస్త్రం నోబెల్ ​బహుమతిని ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి. జినోమ్​ ఎడిటింగ్​ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇమ్మాన్యుయెల్​ చార్​పెంటియర్​, జెన్నిఫర్​ ఏ డౌడ్నను ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసింది.

జీనోమ్​ ఎడిటింగ్​...

జన్యు పరంగా వచ్చే వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడే 'మాలిక్యులర్​ సిజర్స్​ 'వంటిదే ఈ జీనోమ్​ ఎడిటింగ్ విధానం. ఇది చాలా శక్తిమంతమైనదని, కొత్త చికిత్సా విధానాలను ఆవిష్కరించేందుకు ఉపయోగపడుతుందని నోబెల్​ కమిటీ పేర్కొంది. జన్యుపరంగా ఉన్న సమస్యలను ఈ ఎడిటింగ్​తో పరిష్కరించవచ్చని తెలిపింది. అయితే ఇంతటి శక్తిమంతమైన సాంకేతికతను చాలా జాగ్రత్తగా వినియోగించాలని స్పష్టం చేసింది.

పురస్కార గ్రహీతలకు బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు అందించనుంది నోబెల్ కమిటీ.

ఇప్పటికే వైద్య, భౌతిక శాస్త్రాల్లో నోబెల్​ బహుమతులను ప్రకటించింది రాయల్​ స్వీడిష్​ అకాడమి. సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలకు నోబెల్​ పురస్కారాని ప్రకటించాల్సి ఉంది.

ఇవీ చూడండి:-

Last Updated :Oct 7, 2020, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.