ETV Bharat / international

భారత సంస్థ 'జీహెచ్​ఈ'కి ప్రతిష్ఠాత్మక యూఎన్​ అవార్డ్​

author img

By

Published : Oct 28, 2020, 9:59 AM IST

భారత్​కు చెందిన ప్రముఖ పర్యటక, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ గ్లోబల్​ హిమాలయన్​ ఎక్స్​పెడిషన్​(జీహెచ్​ఈ).. ప్రతిష్ఠాత్మక 'యూఎన్​ గ్లోబల్​ క్లైమేట్​ యాక్షన్​ అవార్డ్​-2020'ని గెలుచుకుంది. హిమాలయాల్లోని మారుమూల గ్రామాలకు సౌర విద్యుత్తును అందించటంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ అవార్డుకు అందిచినట్లు యూఎన్​ఎఫ్​సీసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Indian outfit wins UN award
జీహెచ్​ఈ'కి ప్రతిష్టాత్మక యూఎన్​ అవార్డ్​

కొవిడ్​-19 మహమ్మారి పంజా విసురుతున్న వేళ పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నాలకుగాను ఓ భారతీయ పర్యటక సంస్థ.. ప్రతిష్ఠాత్మక యూఎన్​ అవార్డును దక్కించుకుంది. మారుమూల గ్రామాలు సౌర విద్యుత్తును (సోలార్​ ఎనర్జీ) పొందేందుకు సహాయపడిన పర్యటక- సాంకేతిక సంస్థ ది గ్లోబల్​ హిమాలయన్​ ఎక్స్​పెడిషన్​(జీహెచ్​ఈ).. 'యూఎన్​ గ్లోబల్​ క్లైమేట్​ యాక్షన్​ అవార్డు-2020'ను పొందిన సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

ఈ అవార్డుకు ఎంపికైన జాబితాను మంగళవారం ప్రకటించింది యూఎన్​ ఫ్రేమ్​వర్క్​ కన్వెన్షన్​ ఆన్​ క్లైమేట్​ ఛేంజ్​(యూఎన్​ఎఫ్​సీసీసీ). ఈ ఏడాదిలో పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను ఒక ఉదాహరణగా చూపటమే లక్ష్యమని పేర్కొంది. పర్యటకం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రిమోట్​ కమ్యూనిటీలకు సౌర విద్యుత్తును అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైన తొలి సంస్థల్లో జీహెచ్​ఈ ఒకటి అని తెలిపింది.

హిమాలయాల్లోని మారుమాల గ్రామాలపై ప్రభావం చూపే కీలక యాత్రలు చేపడుతుంది జీహెచ్​ఈ. దాని ద్వారా వచ్చే రుసుముల్లో కొంత మేర.. గ్రామాల్లో ఏర్పాటు చేసే సోలార్​ మైక్రో గ్రిడ్​ల సామగ్రి​, వాటి రవాణా, ఏర్పాటు, శిక్షణకు వినియోగిస్తుంది. ఈ మైక్రో గ్రిడ్లను పూర్తిగా గ్రామీణ కమ్యూనిటిలే నిర్వహిస్తాయి. ఇప్పటి వరకు భారత్​లోని మూడు ప్రాంతాల్లో 131పైగా గ్రామాలకు సౌర విద్యుత్తును అందించింది. అది 60 వేలకుపైగా ప్రజలపై నేరుగా ప్రభావం చూపింది. ఇప్పటి వరకు ఈ సంస్థ భారత్​లో చేపట్టిన యాత్రల్లో 60 దేశాల నుంచి 1300 మంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వాతావరణ మార్పుల చట్టానికి 'ఇండియన్​ థన్​బర్గ్'​ పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.