ETV Bharat / international

'చైనా ముప్పుతో భారత్​- అమెరికా మైత్రి బలోపేతం'

author img

By

Published : Jan 21, 2021, 3:36 PM IST

'శత్రువుకు శత్రువు మిత్రుడు' అన్న మాట భారత్​-అమెరికాకు సరిపోయేలా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాలు చైనా నుంచి ఎన్నో సవాళ్లు, ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్​-అమెరికా కలసిగట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్​ అధ్యక్షతన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నారు.

Common concerns over challenges from China to result in deepening of Indo-US  ties: Experts
'చైనా ముప్పుతో భారత్​-అమెరికా మైత్రి బలపడుతుంది'

ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు చైనా తీవ్రంగా కృషిచేస్తోంది. ఇందుకోసం ఇతర దేశాలతో శత్రుత్వం పెట్టుకోవడానికీ వెనుకాడడం లేదు. ఏడాది కాలంలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్​-అమెరికాకు పెను సవాళ్లు విసురుతోంది చైనా. అయితే చైనా విసురుతున్న సవాళ్ల వల్ల భారత్​-అమెరికా బంధం మరింత బలపడుతుందని మాజీ దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ నేతృత్వంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నారు.

చైనాపై కఠినంగానే!

ఆసియాపై విధానపరంగా బైడెన్​ ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు విదేశాంగ మంత్రిగా ఎంపికైన ఆంటోని బ్లిన్​కెన్​. చైనా నుంచి అమెరికాకు సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల ఆ దేశంపై బైడెన్​ ప్రభుత్వం కఠినంగానే ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'అమెరికా నాయకత్వ పాత్ర పోషించాలి'

చైనా నుంచి భారత్​ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని 2015-16లో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన మాజీ దౌత్యవేత్త అరుణ్​ సింగ్​ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థిక, సాంకేతికత, సైనికపరంగా చైనా నుంచి అగ్రరాజ్యం ముప్పు ఎదుర్కొంటోందన్నారు. ఈ పరిణమాల వల్ల భారత్​-అమెరికా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

20ఏళ్లుగా భారత్​-అమెరికా బంధం బలపడుతూ వస్తోందని.. బైడెన్​ హయాంలోనూ అదే కొనసాగుతుందని రాయబారి, గేట్​వే హౌస్ థింక్​ట్యాంక్​ సభ్యుడు రాజీవ్​ భాటియా అభిప్రాయపడ్డారు. అయితే చైనాతో అమెరికా బంధం ఎలా ఉంటుందన్నది కీలకమని పేర్కొన్నారు.

"భారత్​-అమెరికా మధ్య మైత్రి.. 20ఏళ్లుగా మెరుగుపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అయితే ఆసియాపై అమెరికా విధానం, అదే ప్రాంతంలో చైనా విధానాలు రానున్న నెలల్లో ఎలా ఉంటాయన్నది కీలకం. భారత్​-అమెరికా మైత్రిపై ఇది ప్రభావం చూపుతుంది. చైనా తమ శత్రువు అని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్​ అవసరం ఉంది. అదే సమయంలో ఆసియాలోని భౌగోళిక రాజకీయాల పరిస్థితులను పరిశీలిస్తే భారత్​కు అమెరికా అవసరం ఉందని అర్థమవుతుంది. అందువల్ల భారత్​-అమెరికా మధ్య రక్షణ, భద్రత సహకారం బలపడుతుందని భావిస్తున్నా."

-- రాజీవ్​ భాటియా, గేట్​వే హౌస్​ థింక్​ ట్యాంక్​ సభ్యుడు.

ఇదీ చూడండి:- బైడెన్​ వచ్చేశారు- మరి భారత్​కు లాభమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.