ETV Bharat / international

9/11 anniversary:  బైడెన్​.. క్లింటన్​.. ఒబామా 'మౌనం'

author img

By

Published : Sep 11, 2021, 8:02 PM IST

Updated : Sep 11, 2021, 10:50 PM IST

9/11 దాడుల 20వ వార్షికోత్సవం (9/11 anniversary) నేపథ్యంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ దంపతులు నివాళులు అర్పించారు. ఘటన జరిగిన ప్రదేశంలో మౌనం పాటించారు.

9/11 attack
9/11 దాడి

బైడెన్​.. క్లింటన్​.. ఒబామా 'మౌనం'

అమెరికాలో అల్​ఖైదా ఉగ్ర సంస్థ భీకర దాడులకు 20ఏళ్లు (9/11 anniversary) నిండిన నేపథ్యంలో.. సెప్టెంబర్ 11 మెమోరియల్ వద్ద అమెరికా దేశ ముగ్గురు అధ్యక్షులు నివాళులు అర్పించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సహా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్విన్ టవర్స్ కూలిపోయిన ప్రాంతంలో మౌనం పాటించారు. ఘటనలో మరణించినవారికి సంతాపంగా బ్లూ రిబ్బన్​ ధరించి ఐకమత్యాన్ని చాటారు.

9/11 attack
మౌనం పాటిస్తున్న మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షుడు

9/11 దాడులు (9/11 attack) జరిగినప్పుడు బైడెన్ సెనేటర్​గా ఉన్నారు. న్యూయార్క్​తో పాటు ఉగ్రదాడి జరిగిన మూడు ప్రాంతాలను బైడెన్ సందర్శిస్తారని అధికారులు తెలిపారు. పెన్సిల్వేనియాను సందర్శించి చివరగా పెంటగాన్​కు వెళ్తారని వెల్లడించారు.

9/11 attack
జో బైడెన్ దంపతులు

కార్యక్రమం ప్రారంభానికి ముందు జెట్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి.

9/11 attack
హాజరైన జనం

షాంక్​విల్​లో బుష్, కమల ప్రసంగం...

ధైర్యమనేది.. ఊహించిన దానికంటే సాధారణ విషయమని.. మృత్యువు ఎదురైన వెంటనే బయటపడుతుందని మాజీ అధ్యక్షుడు జార్జ్​ బుష్​ వెల్లడించారు. షాంక్​విల్​లో మాట్లాడిన ఆయన.. ఫ్లైట్ 93 విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ధైర్యసాహసాలను కొనియాడారు. వీరంతా అమెరికన్లందరి కోసం నిలబడ్డారని అన్నారు. 'ఫ్లైట్ 93లోని 33 మంది ప్యాసింజర్లు, ఏడుగురు సిబ్బందిని విధి ఎంపిక చేసింది. వీరంతా మన కోసం నిలబడ్డారు. ఈ బృందం... అత్యద్భుతమైన సమూహమని ఉగ్రవాదులు తర్వాత తెలుసుకున్నారు,' అని పేర్కొన్నారు.

ఇదే కార్యక్రమంలో ప్రసంగించిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. 9/11 దాడుల్లో మరణించినవారికి సంఘీభావం తెలిపారు. 'మన దేశంలోని చాలా మంది ఈ 20 ఏళ్ల సమయాన్ని కఠినంగా గడిపారు. మీకు అండగా మేమున్నాం. దేశం మొత్తం మీ వెంటే ఉందని గుర్తుపెట్టుకోండి,' అని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో భవిష్యత్​ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: 9/11 attacks: 20ఏళ్ల పాటు అమెరికా పోరాటం.. ఫలితమేంటి?

Last Updated :Sep 11, 2021, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.