ETV Bharat / international

టైమ్​ 'పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​'గా బైడెన్​-కమల

author img

By

Published : Dec 11, 2020, 10:48 AM IST

Updated : Dec 11, 2020, 12:04 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతలు జో బైడెన్, కమలా హారిస్... ఈ ఏడాది టైమ్​ మ్యాగజైన్ పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​గా ఎంపికయ్యారు.

Jeo Biden
పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​గా బైడెన్​, కమల

మార్పు మంత్రంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, కమలా హారిస్​కు మరో గౌరవం దక్కింది. ప్రఖ్యాత టైమ్​ మ్యాగజైన్​ వారిద్దరినీ సంయుక్తంగా 'పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​'గా ఎంపిక చేసింది.

తుది జాబితాలో బైడెన్​, కమలతో పాటు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ఉన్నారు. చివరకు బైడెన్​-కమల ఎంపికయ్యారు.

"అమెరికా చరిత్ర మార్చినందుకు, విచ్ఛిన్నకర శక్తులకన్నా సహానుభూతే గొప్పదని నిరూపించినందుకు, కష్టాల్లో ఉన్న ప్రపంచానికి ఊరట కలిగించే ప్రణాళికను ఆవిష్కరించినందుకు బైడెన్-కమలను పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​గా ఎంపిక చేశాం"

- ఎడ్వర్డ్​ ఫెల్సెన్​తల్, టైమ్​ మ్యాగజైన్ ప్రధాన సంపాదకులు

  • '2020 గార్డియన్స్​ ఆఫ్​ ద ఇయర్​' గా.. ఆంటోనీ పౌచీ, కరోనాపై ముందుడి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బంది, జాతివివక్షపై పోరాడిన కార్యకర్తలను ఎంపిక చేసింది టైమ్​.
  • 'బిజినెస్​ పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​'గా.. కాన్ఫరెన్సింగ్​ ప్లాట్​ఫాం 'జూమ్​' ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎరిక్​ యాన్​ ఎంపికయ్యారు.
  • 'ఎంటర్​టైనర్​ ఆఫ్​ ద ఇయర్'​గా.. దక్షిణ కొరియాకు చెందిన బాండ్​ బీటీఎస్​ను ఎంపిక చేసింది.
  • 'అథ్లెట్​ ఆఫ్​ ద ఇయర్'​గా.. అమెరికాకు చెందిన బాస్కెట్​ బాల్​ ఆటగాడు లీబ్రోన్​ జేమ్స్​ ఎంపికయ్యారు.

గత ఏడాది స్వీడన్​కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్​బర్గ్​ను పర్సన్​ ఆఫ్​ ద ఇయర్​గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఎంపికైన వారిలో థన్​బర్గ్​ అతిపిన్నవయస్కురాలు కాగా.. ఈ ఏడాది 78 ఏళ్ల అతిపెద్ద వయస్కుడిగా బైడెన్​ ఎంపికవటం గుర్తించదగిన విషయంగా పేర్కొంది టైమ్​ మ్యాగజైన్​.

ఇదీ చూడండి: 'దివాలా' సంస్థకు రుణం- చిక్కుల్లో ట్రంప్ అల్లుడు!

Last Updated : Dec 11, 2020, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.