ETV Bharat / international

రెచ్చిపోయిన బందిపోట్లు- 88మంది మృతి

author img

By

Published : Jun 6, 2021, 11:28 AM IST

bandits, nigeria
బందిపోట్లు, నైజీరియా

నైజీరియా కెబ్బి ప్రాంతంలో బందిపోట్లు రెచ్చిపోయారు. 8 గ్రామాలపై ఒక్కసారిగా దాడి చేసి 88మందిని బలితీసుకున్నారు.

ఆఫ్రికా నైజీరియాలోని కెబ్బి ప్రాంతంలో బందిపోట్లు మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 88మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు.

డంకో-వసాగు ప్రాంతంలోని 8 గ్రామాలపై బందిపోట్లు కాల్పులకు తెగబడ్డారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మొహరించినట్లు పేర్కొన్నారు.

ఏప్రిల్​లోనూ సాయుధులు జరిపిన కాల్పుల్లో.. 9మంది పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు.

ఇదీ చదవండి:క్రియాశీలక రాజకీయాల్లో ట్రంప్​.. ఆట ఆరంభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.