ETV Bharat / ghmc-2020

భాజపా నేతల ఛార్జిషీట్.. గోబెల్స్​ డైరీలా ఉంది : కేటీఆర్

author img

By

Published : Nov 24, 2020, 12:59 PM IST

భాజపా నేతలు గోబెల్స్ కజిన్ బ్రదర్స్​లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. కాషాయ నేతల ఛార్జిషీట్.. గోబెల్స్ డైరీలా ఉందని తెలిపారు.

trs working president ktr
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

తమ మీద ఛార్జిషీట్ వేసే హక్కు భాజపాకు ఎవరిచ్చారని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆరేళ్లలో ప్రగతి పథాన దూసుకుపోతున్నందుకా... తమపై ఛార్జిషీట్ అని నిలదీశారు.

భాజపా నేతలు గోబెల్స్ కజిన్ బ్రదర్స్​లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కమలం నేతల ఛార్జిషీట్ గోబెల్స్ డైరీలా ఉందని ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనందుకు, వరద సాయం చేయనందుకు భాజపాపై ఛార్జిషీట్ వేయాలని పేర్కొన్నారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.